కరీంనగర్‌ మేయర్‌గా సునీల్‌ రావు పేరు ఖరారు

కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకుంది. ఈ క్రమంలో ఆ కార్పొరేషన్‌కు మేయర్‌గా సునీల్‌ రావు పేరును టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది. సునీల్‌రావు వరుసగా నాలుగోసారి గెలుపొందారు.మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ ప్రస్తుతం ఐదోసారి విజయం సాధించారు. ఇవాళ మధ్యాహ్నం కరీంనగర్‌ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. మొత్తం 60 డివిజన్లకు గానూ టీఆర్‌ఎస్‌ 33 డివిజన్లలో గెలుపొందింది. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నిన్న టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరి చేరికతో టీఆర్‌ఎస్‌ బలం 40కి చేరింది. భారతీయ జనతా పార్టీ 13 డివిజన్లలో గెలవగా, ఎంఐఎం 6 డివిజన్లు, ఇతరులు 8 డివిజన్లలో గెలిచారు.